చంద్రబాబును మ‌రోసారిబుక్ చేసిన వై.ఎస్ జ‌గ‌న్..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా వై.ఎస్ జ‌గ‌న్ ఎన్నో రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో పాటు ప‌లు విభిన్న‌మైన రికార్డులు ఆయ‌న సొంతం చేసుకుంటున్నారు. తాజాగా మాజీ ముఖ్య‌మంత్రి, టిడిపి అధినేత చంద్ర‌బాబు ఇంటికి నోటీసులు ఇవ్వ‌డం కూడా ఓ రికార్డుగానే చెబుతున్నారు ప‌బ్లిక్‌.

గుంటూరు జిల్లా తాడేప‌ల్లి మండ‌లం ఉండ‌వ‌ల్లి గ్రామం ప‌రిధిలో చంద్ర‌బాబు నివాసం ఉంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రాంతం కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట వెంబ‌డి ఉన్న ప్రాంతం కావ‌డంతో వ‌ర‌ద‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ ఇక్క‌డ ఇబ్బందులు త‌ప్ప‌వు. జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి వ‌ర్షాలు పుష్క‌లంగా కురుస్తున్నాయి. దీని కార‌ణంగా కృష్ణాన‌దికి వ‌ర‌ద వ‌స్తోంది. దీంతో క‌ర‌క‌ట్ట ప్రాంతాల్లోని వారంద‌రికీ ప్ర‌భుత్వ అధికారులు నోటీసులు ఇస్తున్నారు.

ఇందులో భాగంగానే నిన్న క‌ర‌క‌ట్ట ప్రాంతంలో ఉన్న 36 మందితో పాటు చంద్ర‌బాబు ఇంటికి కూడా నోటీసులు పంపారు. వ‌ర‌ద ఎక్కువ‌గా వ‌స్తోందని ఇందులో పేర్కొన్నారు. గ‌త సంవ‌త్స‌రం కూడా అధికారులు ఈ స‌మాచారం తెలియజేశారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు కుటుంబం హైద‌రాబాదులోనే ఉండ‌టంతో ఎలాంటి ఇబ్బంది రాలేదు. కాగా చంద్ర‌బాబు అధికారంలో ఉన్నఐదేళ్ల కాలంలో కృష్ణాన‌దికి ఎప్పుడూ వ‌ర‌ద రాలేదు. దీంతో ఆయ‌న‌కు నోటీసులు అందుకునే అవ‌కాశ‌మే లేదు.

అయితే జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి కృష్ణాన‌దికి వ‌ర‌ద వ‌స్తూనే ఉంది. దీంతో అంద‌రిలాగే చంద్ర‌బాబు ఇంటికి కూడా నోటీసులు అందించాల్సి వ‌స్తోంది. ఇదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఇంటికి రెండు సార్ల నోటీసులు ఇచ్చి రికార్డు సృష్టించార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. కాగా క‌ర‌క‌ట్ట ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు ఉండ‌కూడ‌ద‌ని తెలియ‌దా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here