ముఖ్య‌మంత్రి కార్టూన్ షేర్ చేసినందుకు చిత‌క్కొట్టారు

ముఖ్యమంత్రి కార్టూన్ ను షేర్ చేసిన పాపానికి ఓ వ్య‌క్తిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల‌లో కాదు మ‌హారాష్ట్రలో జ‌రిగింది. సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కార్టూన్ ను వాట్సాప్‌లో షేర్ చేసినందుకు ఓ రేంజ్‌లో కొట్టారు.

నేవీ మాజీ అధికారి మ‌ద‌న్ శ‌ర్మ సీఎంకు సంబంధించి ఎగ‌తాళి చేసిన‌ట్టుగా ఉండే ఓ కార్టూన్‌ను వాట్సాప్ లో షేర్ చేశారు. దీంతో శివ‌సేన కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఆయ‌న‌కు ఫోన్ చేసి అడ్ర‌స్ అడిగారు. ఆ వెంట‌నే ఇంటి ద‌గ్గ‌ర‌కు మాస్కులు ధ‌రించి వ‌చ్చారు. దీన్ని గ‌మ‌నించిన ఈయ‌న వెంట‌నే పారిపోయేందుకు ప్ర‌య‌త్నించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న్ను వ‌ద‌ల్లేదు.

ఇంట్లో నుంచి తీవ్రంగా కొడుతూ బ‌య‌ట‌కు ఈడ్చుకొచ్చారు. ఈ దాడిలో ఆయ‌న‌కు తీవ్ర‌గాయాలైన‌ట్లు తెలుస్తోంది. కంటి భాగంలో తీవ్ర గాయ‌మైంది. అనంత‌రం మ‌ద‌న్ శ‌ర్మ స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల‌ను చూపించారు. ఈ ఘ‌ట‌న‌పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఘ‌ట‌న‌లో బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. సోష‌ల్ మీడియా ఎక్కువ ప్ర‌చుర్యంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ్య‌క్తుల‌పై ప్ర‌త్య‌క్ష్యంగానూ, ప‌రోక్షంగానూ మాట‌ల దాడులు చేయ‌డం ఎక్కువ అవుతోంది. ఈ ప‌రిస్థితుల్లో త‌ప్పు చేసిన వారిని శిక్షించ‌డానికి పోలీసులు ఉండ‌గా.. ఇలా దాడులు చేయ‌డం క‌రెక్టు కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త మ‌వుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here