మళ్ళీ మొదలుకానున్న పుష్ప షూటింగ్..?

అల వైకుంఠ పురంలో.. లాంటి బ్లాక్ బాస్టర్ తరువాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం పుష్ప. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే మళ్లీ పుష్ప టీమ్ చిత్రీకరణకు సిద్దం అయింది. థాయిలాండ్లో షూటింగ్ చేద్దాం అనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న కరోనా వైరస్ నిబంధనల కారణంగా థాయిలాండ్ వెళ్లే పరిస్థతి లేకపోవడంతో తెలంగాణలోని అడవుల్లో షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన రశ్మిక మందన్న కథానాయిక గా నటిస్తుండగా, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here