‘బద్రి‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రేణు దేశాయ్. ప్రస్తుతం దర్శకురాలిగా, రచయితగా తన కెరీర్ ను కొనసాగిస్తోందీ టాలెంటెడ్ మామ్. ఇక పిల్లలతో, సినిమాలతో బిజీగా ఉండే రేణుదేశాయ్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన చిన్నారుల ఫోటోలతో పాటు.. వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే రేణుదేశాయ్ ఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
రేణు దేశాయ్ కెమెరా ముందుకొచ్చి సెప్టెంబర్ 9తో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తాను తొలిసారి ఇచ్చిన ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ… ‘1995, సెప్టెంబర్ 9.. నేను మొదటిసారి కెమెరా ముందుకొచ్చి పాతికేళ్లు పూర్తయ్యాయి. అంతరిక్ష శాస్త్రవేత్త లేదా డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని. కానీ, విధి నా జీవితాన్ని మరోలా ప్లాన్ చేసింది. 16 ఏళ్ల వయసులో అనుకోకుండా నేను కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది. అప్పడే సినిమాలతో ప్రేమలో పడిపోయాను. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నాసాలో జాయిన్ అయి శాస్త్రవేత్త కావాలనుకున్న నా కలను వదులుకోవాల్సి వచ్చినపుడు చాలా బాధపడ్డాను. చాలా ఏళ్ల పాటు ఆ బాధ నన్ను వెంటాడింద`ని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది రేణు.