బాలసుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యంపై కీల‌క అప్‌డేట్ విడుద‌ల..

సినీ గాయ‌కుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యంపై కీల‌క‌మైన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న క‌రోనాతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చేరిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు నేడు వెల్ల‌డించాయి.

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం హాస్పిట‌ల్‌లో చేరిన మొద‌ట్లో కోలుకుంటున్నార‌ని చెప్పారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఆరోగ్యం క్షీణించింద‌ని తెలిసింది. ఓ రోజు ఆయ‌న ఆరోగ్యం విష‌మించ‌డంతో ఐసీయూలో పెట్టి చికిత్స అందించార‌ని వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే దీనిపై ఆయ‌న కుమారుడు స్పందిస్తూ నాన్న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యం చేస్తూనే ఉన్నార‌ని గ‌త నాలుగు రోజులుగా ఆయ‌న అభిమానుల‌కు చెబుతూనే ఉన్నారు.

అయితే నేడు ఎంజీఎం హాస్పిట‌ల్ యాజ‌మాన్యం బాలు ఆరోగ్యంపై బులిటెన్ విడుద‌ల చేసింది. ఇందులో ఏముందంటే ఆయ‌న‌కు ఇంకా చికిత్స చేస్తున్నాం. వెంటిలేట‌ర్, ఎక్మో స‌హాయంతో ఆయ‌న‌కు ఐసీయూలోనే ట్రీట్‌మెంట్ కొన‌సాగుతోంది. మా వైద్యులు ఆయ‌న్ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. అని హాస్పిట‌ల్ యాజ‌మాన్యం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here