రష్మిక అంత డిమాండ్‌‌ చేస్తోందా..?

రష్మిక మందన్న.. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌ దర్శకనిర్మాతలకు ఫేవరేట్‌ ఛాయిస్‌గా మారింది. గీత గోవిందం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిన్నది అనంతరం వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. ఇక మహేష్‌ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించి టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న రష్మిక వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. ఇక బన్నీ సరసన పుష్ప చిత్రంతో నటించే అవకాశాన్ని కొట్టేసింది.

ఇదిలా ఉంటే తాజాగా శర్వానంద్‌ హీరోగా నటిస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహర్లు’ సినిమాలో రష్మిక నటిస్తోన్న విషయం తెలిసిందే. దసరా సందర్భంగా ఈ చిత్ర యూనిట్‌ తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంకోసం రష్మిక ఏకంగా రూ.1.20 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ సమయంలో రూ.కోటి డిమాండ్‌ చేయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు షాక్‌కు గురైనట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తుంటే రష్మిక.. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకునే పనిలో ఉన్నట్లు అర్థమవుతోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఈ విషయంపై రష్మిక అధికారికంగా స్పందించాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here