కెరీర్ తొలినాళ్ల నుంచి ఒకవైపు గ్లామర్తో పాటు మరోవైపు ట్రెడిషనల్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది అందాల తార రాశీఖన్నా. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటోన్న రాశి తన ఫొటో షూట్లకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. ఒకవైపు జిమ్లో వర్కవుట్లు చేస్తోన్న సమయంలో దిగిన హాట్ హాట్ ఫొటోలతో పాటు మరోవైపు ట్రెడిషనల్ లుక్లో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఆమె అభిమానులను ఆకర్షిస్తోంది. ఇటీవల లంగావోణీలో దిగిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్గా మారిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా చీర కట్టులో దిగిన కొన్ని ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిందీ బ్యూటీ. కళ్లకు కాటుకతో, తలలో మల్లె పూలు, నుదుట బొట్టుతో అచ్చ తెలుగు ఆడ పిల్లలా ఆకట్టుకుంటుందీ బ్యూటీ. ఇక ఈ ఫొటోలు చూసిన ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. మరి రాశీఖన్నా పోస్ట్ చేసిన ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.