ఇప్పుడిప్పుడే తెలుగు లో యాంకర్ గా తన హవాకొనసాగిస్తున్న ఓ యువతిపై గిరీష్ అనే యువకుడు అత్యాచారం చేశాడు.దీంతో కేసు నమోదు చేసుకున్న నిందితుణ్ని కటకటాలపాలు చేశాడు. అమ్మాయిలు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ఇలాంటి కామాందులు ప్రమాదాన్ని కలిగిస్తారని …జాగ్రత్తగా ఉండాలని..పిల్లల సంరక్షణలో తల్లిదండ్రులు బాధ్యత ఎక్కవ అని సూచిస్తున్నారు.
ఓ ఛానల్ లో యాంకర్ గా ఉన్న ఓ యువతి వనస్థలీపురంలో ఉంటుంది. ఆమెకు సమీపంలో ఉండే గిరీష్ అనే వ్యక్తి ఓ రోజు యాంకర్ ఫోన్ చేసి బెదిరించాడు.
నేను నీ నగ్నవీడియోలు తీశాడు. నాదగ్గరే ఉన్నాయంటూ ఫోన్ చేశాడు. దీంతో ఆందోళనకు గురైన సదరు యువతి ఆ దుండగుడి దగ్గరకు వెళ్లి వీడియోల్ని తెచ్చుకునే ప్రయత్నం చేసింది. అప్పటికే మాటు వేసిన గిరీష్ ఆమె ఇంటికి రాగానే అత్యాచారం చేశాడు. ఆపస్మారకస్థితిలో్ ఉన్న ఆయువతిని అనంతపురం కారులో తీసుకెళ్లి మరోసారి అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆయువతి దుండగుడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గిరీష్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా ఇంత జరిగినా ఆమె తల్లిదండ్రులు కానీ, ఆమె యాంకరింగ్ చేస్తున్న ఛానల్ కానీ ఆమె గురించి వాకాబు ఎందుకు చేయలేదంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.