ఓటీటీలో విడదల కానున్న మరో పెద్ద సినిమా..?

కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో చాలా మంది నిర్మాతలు సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారు. ఇక చిత్ర నిర్మాణాలు కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే.  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొన్ని సడలింపులతో చిత్ర షూటింగ్ లను ఇప్పుడిప్పుడే తిరిగి  ప్రారంభిస్తున్నారు. అయితే థియేటర్లు తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతాయన్నదానిపై ఓ క్లారిటీ లేదు. దీంతో కొంతమంది నిర్మాతలు ఇప్పటికే  తమ  చిత్రాలను ఓటీటీ వేదికగా విడుదల చేశారు.  దిల్ రాజు నిర్మాణంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన ‘వి’ ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదలైన తొలి బడా చిత్రం ఇదే.

ఇదిలా ఉంటే దిల్ రాజు ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు మరో బడా సినిమాను  ఓటీటీలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నితిన్, కీర్తి సురేశ్ నటీనటులుగా ‘రంగ్ దే’ అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం కోసం ఓటీటీ సంస్థలు కూడా గట్టిగానే పోటీ పడుతున్నాయని టాక్.  జీ5 తో పాటు హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ మధ్య పోటీ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా జీ5.. డిజిటల్ హక్కుల కోసం నిర్మాతలకు లాభం వచ్చేలా ఆఫర్స్ ఇస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here