జయ ప్రకాష్ మరణంపై స్పందించిన ప్రధాని మోదీ..

తనదైన హాస్యంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు జయప్రకాష్ రెడ్డి (74) ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ క్రమంలోనే తాజాగా జయప్రకాష్ మరణం పై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం..

‘జయ ప్రకాష్ రెడ్డి  తనదైన ప్రత్యేక నటనా శైలితో  అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు.  వారి మరణం  సినిమా ప్రపంచానికి తీరని  లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.’ అంటూ మోదీ తెలుగులో  ట్వీట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here