ప్రేమ యాత్రలో ‘కొత్తజంట’..

కరోనా కారణంగా కొన్ని నెలలపాటు ఇంటి పట్టునే ఉన్నవారు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మళ్లీ విహార యాత్రలకు బయలుదేరుతున్నారు. మరీ ముఖ్యంగా సినీ తారలు ఎంచక్కా విదేశాలకు చెక్కేస్తున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన రానా-మిహికా బజాజ్‌లు ప్రస్తుతం హనీమూన్‌ ట్రిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మిహికా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటోను చూస్తే ఈ జంట విహార యాత్రలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ ఫొటోను గమనిస్తే ఎక్కడో సముద్ర ఒడ్డున సేదతీరుతున్నట్లు కనిపిస్తోంది.

View this post on Instagram

Just because 🥰🥰 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on

ఇక రానా-మిహికా బజాజ్‌లు ఆగస్టు 8న కొవిడ్‌ కారణంగా కేవలం కొంతమంది సన్నిహితుల సమక్షంలో రామానాయుడు స్టూడియోలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మే నెలలో రానా తన ప్రేమ సంగతిని ప్రపంచంతో పంచుకున్నాడు. మిహికా తన ప్రేమకు ఓకే చెప్పిందంటూ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆ తర్వాత ఇరు కుటుంబాలను పెళ్లికి ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక రానా కెరీర్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం విరాట పర్వం, అరణ్య చిత్రాల్లో నటిస్తున్నాడు.

View this post on Instagram

My happy place! 🥰🥰 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here