జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటీవల గుంటూరు వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రరాష్ట్ర రాజకీయాలలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ సందర్భంగా పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలాగే ఆయన తనయుడు మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ క్రమంలో హీరో రామ్ చరణ్ చంద్రబాబు చేసిన ప్రసంగం చాలా అద్భుతంగా ఉందని కితాబు ఇస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టడం జరిగింది.
‘ఉత్తేజ పరిచేలా, నిజాయతీగా ఉన్న గొప్ప ప్రసంగం!! భవిష్యత్తులో నైనా రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశిద్దాం..’ అని తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్న రామ్ చరణ్, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న ఓ ఫొటోను జతపరిచాడు. ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కరక్టేగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు అని కొందరు, కేంద్రాన్ని కడిగేసిన పవన్ కళ్యాణ్ అని మరికొందరు….అలాగే అబ్బ కొడుకులిద్దరికీ చుక్కలు చూపించిన పవన్ అని మరికొందరు ఇలా కామెంట్ చేస్తూ తమ మద్దతు తెలిపారు.ఏదేమైనా పవన్ కళ్యాణ్ గుంటూరు వేదికగా చేసిన ప్రసంగం చాలా అద్భుతం అని రాజకీయనాయకులు సినిమా హీరోలు పలువురు అంటున్నారు.