రాం గోపాల్ వర్మ ఏం చేసినా ఓ సంచలనమే అవుతుంది. ఎందుకంటే ఆయన తీస్తున్న సినిమాలే కాకుండా ఆయన చేసే ప్రతి కామెంట్ కూడా వివాదాస్పదంగానే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఆయన ఏ సినిమా చేసినా ఆ సినిమా ఫ్రీగా పబ్లిసిటీ అవుతుంది. ఎందుకంటే ఆ సినిమాల్లోని కథ, పాత్రలు వివాదాస్పదంగా మారతాయి.
తాజాగా ఆయన మర్డర్ అని ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. మిర్యాలగుడాలో వివాదాస్పదమైన ప్రణయ్-అమృత నిజ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమా వివాదాస్పదమైంది. అమృత కుటుంబ సభ్యులు కోర్టుకు కూడా వెళ్లారు. కేసును విచారించిన కోర్టు విడుదలకు అనుమతినిచ్చింది.
ఈ సినిమా ఈ నెల 24వ తేదీన రిలీజ్ అవ్వబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ సినిమాపై స్పందించారు. మర్డర్` అనేది మారుతీరావు, అమృతకు సంబంధించిన కథ కాదని, అలాంటి ఎన్నో సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అని వర్మ తాజాగా పేర్కొన్నారు. రేపు (మంగళవారం) మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ ఎదుట రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతామని వర్మ తెలిపారు. అక్కడే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామన్నది అప్పుడే చెబుతానన్నారు. మరి వర్మ ఏం చెప్పనున్నాడో అన్న దానిపై అందరికీ ఉత్కంఠత నెలకొంది.