మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో చెర్రీ దేశంలోని అన్ని భాషల్లో మొదటిసారి కనిపించనున్నాడు. దీంతో చెర్రీ తన తర్వాతి చిత్రాన్ని కూడా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
లాక్డౌన్ సమయంలో పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నాడు రామ్ చరణ్. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా నేపథ్యంలో ఉండే కథలకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తమిళ అగ్ర దర్శకుడు మోహన్ రాజా చెప్పిన కథ చెర్రీకి నచ్చిందట. చెర్రీ నటించిన `ధృవ` సినిమా మాతృక `తనీ ఒరువన్`ను మోహన్ రాజానే రూపొందించారు. స్టైలిష్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్న మోహన్ రాజా, రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందబోతోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే ఆర్.ఆర్.ఆర్తో వచ్చే ఫేమ్ను చెర్రీగా ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయినట్లు అర్థమవుతోంది.