బాలయ్య డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ట్రైలర్‌ వచ్చేసింది..

నటసింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో నర్తనశాల అనే చిత్రాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో దౌప్రది పాత్రలో దివంగత నటి సౌందర్య, అర్జునిడిగా బాలకృష్ణ, భీముడిగా దివంగత నటుడు శ్రీహరి నటించారు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల పాటు షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం సౌందర్య అకాల మరణంతో ఆగిపోయింది. అయితే అప్పటికే చిత్రీకరించిన సన్నివేశాలను దసరా కానుకగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫామ్‌లో విడుదల చేయడానికి బాలకృష్ణ నిర్ణయించారు. 17 నిమిషాల సన్నివేశాలు గల బాలయ్య ‘నర్తనశాల’ను శ్రేయాస్‌ ఈటి ద్వారా అక్టోబర్‌ 24న విడుదల చేయనున్నారు.

ఇదిలా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ అధికారికంగా విడుదల చేసింది. పాండవుల అజ్ఞాతవాసంలోని విరాటపర్వంలోని ఘట్టాన్ని ట్రైలర్‌లో చూపించారు. ఇందులో బాలయ్య బాబు అర్జునుడి పాత్రలో ఒదిగిపోయారు. ఇక దివంగత తారలు మరోసారి చూసేసరికి వారు ఇండస్ట్రీలో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్‌ను చూస్తే సినిమా పూర్తి చేసి ఉంటే బాగుంటుందనే భావన కచ్చితంగా కలగక మానదు. ఇలా బాలయ్య బాబు చొరవతో శ్రీహరి, సౌందర్యలను మరోసారి సినిమాలో చూసుకునే అవకాశం వారి అభిమానులకు దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here