ధృవ సినిమా తరవాత కాస్తంత ఎక్కువ టైం తీసుకుని తన తరవాతి మూవీ మొదలు పెట్టాడు హీరో రామ్ చరణ్ . సుకుమార్ తో ఒక పల్లెటూరు బేస్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని దాన్ని ఆవిష్కరించడం కోసం చరణ్ సిద్దం అవుతున్నాడు. రామ్ చరణ్ లుక్ నుంచీ అన్నీ మార్చుకోవడం కోసం కాస్త టైం పట్టింది. ఎట్టకేలకు తూర్పుగోదావరి జిల్లాలోని పూడిపల్లి అనే గ్రామంలో ఎట్టకేలకు షూటింగ్ మొదలుపెట్టేశారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ షూట్ జరుగుతోంది హైదరబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న చరణ్ ఎయిర్పోర్ట్ లోంచే సేల్ఫీ దిగి ఫేస్ బుక్ లో పెట్టాడు. పూడి పల్లి గ్రామం లో తన తండ్రి ఆపద్భాందవుడు , బాలయ్య బంగారు బుల్లోడు సినిమాలు తెరకి ఎక్కించారు ఇక్కడే చరణ్ సినిమా షూట్ అవుతూ ఉండడం విశేషం