ఇలా చేస్తే ఆత్మ మీతో మాట్లాడుతుంది: రకుల్

ఫిట్ నెస్ పై ఎక్కువగా ఆసక్తి చూపించే కథానాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. నిత్యం సినిమాలతో బిజీగా గడిపే ఈ బ్యూటీ క్రమంతప్పకుండా వర్కౌట్లు, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తుంటుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం రకుల్ కు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా రకుల్ పోస్ట్ చేసిన ఓ ఫొటో దానికి ఇచ్చిన క్యాప్షన్ నెటిజెన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

తాజాగా  యోగాస‌నం వేసిన స్టిల్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అర్థ పద్మాసనం వేసిన సమయంలో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ… ‘మనస్సును నిశ్శ‌బ్ధంగా ఉంచండి.. మీ ఆత్మ మాట్లాడుతుంది. మెడిటేష‌న్ మిమ్మ‌ల్ని మీలోని అంత‌ర్గ‌త ప్ర‌పంచంతో అనుసంధానిస్తుంది’ అని ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here