డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సుమారు నాలుగు గంటలపాటు విచారణ జరిపిన అధికారులు రకుల్ నుంచి పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. తాను ‘డ్రగ్స్ చాట్స్’ చేశానని… కానీ ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని రకుల్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా విచారణలో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ మరో నలుగురు సెలబ్రిటీల పేర్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ నలుగురు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఆ సెలబ్రిటీలు బాలీవుడ్ కు చెందిన వారా.. లేదా టాలీవుడ్ కి చెందిన వారా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఇక ఈ విచారణకు సంబంధించి ముంబయి ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ అశోక్ జైన్ మాట్లాడుతూ.. ‘సిట్ రకుల్ప్రీత్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. దాన్ని విశ్లేషించి, నివేదికను కోర్టుకు సమర్పించనున్నాం’ అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఎన్సీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.