ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోంది. సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో లెజెండరీ బయోపిక్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
ఒలింపిక్ మెడల్ విజేత, తెలుగు మహిళ కరణం మల్లీశ్వరి బయోపిక్ను తీయాలని రచయిత, నిర్మాత కోన వెంకట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. భారత వెయిట్ లిఫ్టింగ్లో తొలి పతకం సాధించిన మల్లేశ్వరి బయోపిక్లో రకుల్ నటించనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తొలుత ఈ పాత్ర కోసం సమంత, రకుల్ లో ఎవరో ఒకరిని ఎంచుకోవాలని భావించిన చిత్ర యూనిట్ చివరికి రకుల్ పైపు మొగ్గుచూపినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాలి.