గత కొన్ని రోజులుగా డ్రగ్స్ అంశం అన్ని సినిమా ఇండస్ట్రీలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అరెస్టుతో డ్రగ్స్ అంశం బయటపడింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ తీసుకుంటుందని.. రియా తన విచారణలో ఈ విషయాన్ని తెలిపిందని మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అనంతరం అసలు రియా ఎవరి పేర్లు బయట పెట్టలేదని కూడా ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మాదక ద్రవ్యాల కేసులో తనపై మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వార్తలు ప్రసారం కాకుండా సమాచారశాఖకు ఆదేశాలివ్వాలని రకుల్ ప్రీత్సింగ్ పిటిషన్లో కోర్టును కోరింది. జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం పిటిషన్ను విచారణకు స్వీకరించింది. మరి చివరికి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో చూడాలి..!