కేవలం ఒకే ఒక్క పాట కోసం విదేశాలకి వెళ్ళే సినిమాల టీం లు బోలెడు ఉన్నాయి. ఈ మధ్యన సినిమా సినిమా మొత్తం కూడా విదేశం లో తీస్తున్నవారు ఏందరో. కానీ ఇండియా లోనే అత్యధిక బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న రోబో సీక్వెల్ మాత్రం పూర్తిగా ఇండియా లో తెరకి ఎక్కించారు. నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ని లైకా ప్రొడక్షన్స్ వారు ఒక్క షెడ్యూల్ కూడా వేరే దేశం లో తీయడం లేదు. సాధారణంగా శంకర్ సినిమా అనగానే ప్రపంచం లోని వివిధ ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటారు.
కానీ మోడీ మాటలని లెక్క చేసిన శంకర్ మోడీ చెప్పినట్టు ఏం చేయాలన్నా భారతీయ సాంకేతికతనే ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ‘2.0’ షూటింగ్ అంతా కూడా ఇండియాలోనే చేయాలని.. ఇక్కడి వనరుల్నే ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ కోరిక మొదటి నుంచీ రజినీకాంత్ ప్లాన్ కాగా ఇక ఎవ్వరూ కాదనలేక పోయారు.