ఒక్క బాహుబలి చిత్రం తో రాజమౌళి రేంజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన కోసం స్టార్ హీరోలు తెలుగులోనే కాక హిందీ లో కూడా క్యూ కట్టేశారు అంటే ఆయన స్థాయి పెరిగిని అని అర్ధం చేసుకోవచ్చు. బాహుబలి తో బంధం ఇక అయిపొయింది అంటూ ప్రమోషన్ లు ఆపేసిన రాజమౌళి విశాఖ లోని జగ్గరాజు పెట్ గ్రీన్ సిటీ లో బాడ్మింటన్ అకాడమీ స్టార్ట్ చేసారు. ఇక్కడ మాట్లాడిన ఆయన ” దేశం లో ద్రోణాచార్యులు చాలా మంది ఉన్నారు కానీ అర్జునులు మాత్రం కనపడ్డం లేదు.
లక్ష్యం మీద పూర్తిగా దృష్టి పెట్టె అర్జునులు కావాలి . ద్రోణాచార్యుల వారి ప్రశ్నకు అర్జునుడు బదులిస్తూ.. పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు మన కొత్త అర్జునులకి కూడా లక్ష్యం మాత్రమె కనపడాలి ” అంటూ చెప్పుకొచ్చారు