కరోనా మహమ్మారి కారణంగా అందరి లెక్కలు మారిపోయాయి. కరోనాకు ముందు వేసుకున్న లెక్కలన్నీ చెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ల విషయంలో కరోనా వారి ప్రణాళికలన్నింటినీ తారుమారు చేసేసింది. నిజానికి అంతా సవ్యంగా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్లు హీరోగాలుగా తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర టీజర్ ఇపాటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.
అయితే ఇదే విషయమై తాజాగా స్పందించిన రాజమౌళి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టీజర్ను ఎప్పుడు విడుదల చేస్తారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘కరోనా ముందు నేను ఒక తేదీని చెప్పాను. కానీ ఇప్పుడు అలా చెప్పలేను. ఇప్పుడు షూటింగ్కు కొన్ని ప్రొటోకాల్స్ ఉన్నాయి. వీటి ప్రకారం అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తి చేయగలమా.? ఇంకా సమయం పడుతుందా, వచ్చే ఇబ్బందులేంటి అనేవి నేను సెట్స్ పైకి వెళ్తే తప్ప చెప్పలేను. ప్రస్తుతానికైతే 2 నెలల షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాం. త్వరలోనే సెట్స్పైకి వెళుతున్నాం. పరిస్థితులన్నీ చూసుకొని, అన్ని అనుకున్నట్లు జరిగితే అప్పుడు టీజర్ విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు జక్కన్న.