హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్న పూరి, నాగ్.?

నాగార్జున, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్, శివమణి చిత్రాలు ఎంతటి విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ లోని సరికొత్త యాంగిల్ ను ఈ చిత్రాలు ప్రేక్షకులకు పరిచయం చేశాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇదిలా ఉంటే మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రానుందా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. త్వరలోనే పూరి జగన్నాథ్.. నాగార్జునను డైరెక్ట్ చేయనున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బహుశా ఈ ప్రాజెక్టులు  పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కనుంది. శివమణి చిత్రం విడుదలై అక్టోబర్ 24కు 17 ఏళ్లు పూర్తి కానుంది. ఈ తరుణంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రానుందనే వార్త.. అటు పూరి, ఇటు నాగ్ అభిమానుల్లో ఆసక్తిరేకెత్తిస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here