బాలీవుడ్ బాట పట్టనున్న కేజీఎఫ్ దర్శకుడు.?

‘యష్ ‘ హీరోగా కన్నడంలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ కన్నడ చిత్రం దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకోవడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఇక ఈ సినిమా ఆ రేంజ్ లో హిట్ కావడానికి ప్రధాన కారణం దర్శకత్వమేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ నీల్ సినిమాను తెరకెక్కించిన విధానం అన్ని భాషల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రంతో బిజీగా ఉన్న ప్రశాంత్.. తర్వాతి చిత్రం ఏంటనే దానిపై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ తన తర్వాత చిత్రాన్ని టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ తో చేయనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కూడా వార్తలు షికారు చేశాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ తన తర్వాతి చిత్రాన్ని బాలీవుడ్ లో తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది.

తాజాగా ప్రశాంత్ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కు కథ చెప్పడానికి కలవనున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ప్రశాంత్ స్పందించాల్సిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here