పవన్‌ అభిమానులకు ట్రిపుల్‌ బొనాంజా..!

యూత్లో పవన్కళ్యాణ్కు ఉన్న క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్స్టార్సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్వచ్చినా సరే అది క్షణాల్లో వైరల్గా మారుతుంది. అలాంటిది ఒకే రోజు మూడు అప్డేట్లు వస్తే.. అవును సెప్టెంబర్‌ 2 పవన్కళ్యాణ్పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు ట్రిపుల్ట్రీట్అందనుంది.

అజ్ఞాతవాసిచిత్రం తర్వాత రాజకీయాల్లో బిజీగా మారిన పవన్కళ్యాణ్తాజాగా మళ్లీ వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నపింక్‌’ రీమేక్‌ ‘వకీల్సాబ్‌’తో పవన్ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే సెప్టెంబర్‌ 2 పవన్కళ్యాణ్పుట్టిన రోజున అభిమానుల కోసం మూడు సర్ప్రైజ్లు సిద్ధంగా ఉన్నాయి. ఉదయం 9:09 నిమిషాలకువకీల్సాబ్‌’ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌, మధ్యా్హ్నం 12:30 నిమిషాలకు పవన్కళ్యాణ్‌ 27 చిత్రానికి సంబంధించి, సాయంత్రం 4:05 నిమిషాలకు 28 చిత్రానికి సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు. లెక్కన చూసుకుంటే పవన్ఏకంగా మూడు సినిమాలతో అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడన్నమాట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here