విలన్ గా మారనున్న పూర్ణ..!

శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నటి పూర్ణ. తనదైన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఈ బ్యూటీ.. పలువరుస సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా సీమటపాకాయ్, అవును, అవును 2, రాజుగారిగది వంటి చిత్రాలతో నటిగా మంచి పేరు సంపాదించుకుంది. కేవలం సినిమాలలోనే కాకుండా రియాల్టీ షోలో జడ్జిగా పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందీ చిన్నది.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకు పరిమితమైన పూర్ణ తాజాగా విలన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో పూర్ణ నటించనున్నట్లు సమాచారం. రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో పూర్ణ.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం పూర్ణ తన మేక్ఓవర్ ను కూడా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ..  నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన నటనతో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here