టాప్ హీరోయిన్ పూజా హెగ్డే తెగ బాధపడుతోంది. టాలీవుడ్ కంటే బాలీవుడ్పైనే ఫోకస్ ఎక్కువగా పెట్టినట్లు ఆమె మాట్లలో అర్థం అవుతోంది. తెలుగులో హిట్ కొట్టి ఇప్పుడు హిందీపై ఫోకస్ పెట్టినట్లు ముద్దుగుమ్మ విషయాలు చెప్పింది.
టాలీవుడ్లో అందరు స్టార్ హీరోలతో పూజా హెగ్డే సినిమా అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే టాలీవుడ్ కంటే ముందు బాలీవుడ్లోనే తాను మొదటి సినిమా చేసినట్లు ఈ భామ చెప్పింది. కానీ ఆ సినిమా ఊహించిన దానికి భిన్నంగా ఘోరంగా పరాజయం చూపించింది. ఆ తర్వాత టాలీవుడ్పై దృష్టి సారించి ఇక్కడి ప్రేక్షకుల్ని మెప్పించగలిగింది. ఆ తర్వాత `హౌస్ఫుల్-4`తో బాలీవుడ్లోనూ సక్సెస్ అందుకుంది.
తాజాగా హిందీలో బాగా గ్యాప్ రావడంపై పూజా స్పందించింది. `మొహంజదారో పరాజయం పాలవడం తనను బాగా బాధపెట్టినట్లు ఆమె తెలిపింది. ఎవరికైనా మొదటి సినిమా ఎంతో కీలకమైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తొలి సినిమా ఫెయిల్ కావడంతో గుండె పగిలినంత పనైందట. అయితే దక్షిణాదిన విజయం సాధించడంతో ధైర్యంగా ముందుకు సాగినట్లు చెప్పింది. హౌస్ఫుల్-4 సక్సెస్ సాధించడంతో బాలీవుడ్పై కూడా దృష్టి సారించాన`ని పూజ తెలిపింది.