అమెరికాలో టీ అమ్ముతోన్న హీరోయిన్ కీర్తి సురేష్‌..

తెలుగు సినీ రంగంలో త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్‌. చేసిన ప్ర‌తి సినిమాతో త‌న న‌ట‌న‌ను నిరూపించుకున్నారు ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం అమెరికాలో టీ అమ్ముతున్న‌ట్లు కీర్తి సురేష్ చెప్పారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందో ఓ లుక్కేద్దాం..

కీర్తి సురేష్ ప్ర‌స్తుతం మిస్ ఇండియా అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో న‌టిస్తోంది. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తిసురేష్‌ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో హై బడ్జెట్‌తో తీశారు. న‌వంబ‌ర్ 4వ తేదీన ఓటీటీ వేదికగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సినిమా ఏంటంటే.. అమెరికాలో ఎక్కువ‌గా కాఫీ తాగ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. దీన్ని బేస్ చేసుకొని ఇండియా నుంచి వెళ్లి ఓ అమ్మాయి అమెరికాలో టీ బిజినెస్ స్టాట్ చేస్తుంది. అక్క‌డ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని బిజినెస్‌లో రాణిస్తుందో సినిమాలో తెలుస్తుంద‌ని కీర్తి సురేష్ చెప్పారు.

అమెరికాలో టీ అమ్మ‌డంలో ఎదుర‌య్యే స‌వాళ్ల‌తోనే సినిమా ఉంటుంద‌ని కీర్తి చెప్పారు. మొత్తానికి ఇండ‌స్ట్రీ ఇబ్బందుల్లో ఉన్న ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కుల మందుకు సినిమా వెళ్ల‌డ‌మే త‌న‌కు ముఖ్య‌మని కీర్తి చెబుతున్నారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంటుందో 4వ తేదీన తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here