తన పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతున్నారన్న వార్తలపై ప్రముఖ సింగర్ సునీత స్పందించారు. ఫేస్బుక్ ద్వారా ఆమె ఆకతాయిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
సింగర్ సునీత మేనల్లుడినంటూ అనంతపురం జిల్లాలో చైతన్య అనే వ్యక్తి చలామణీ అవుతున్నాడని ఇటీవల ఓ పేపర్లో వార్త ప్రచురితమైంది. ఇందులో ఏముందంటే సునీత తనకు బాగా తెలుసని చైతన్య అందరితో చెప్పుకునేవాడు. చాలా మంది వద్ద డబ్బుల వసూళ్లకు పాల్పడ్డాడు. మొత్తానికి ఈ విషయం సింగర్ సునీతకు చేరింది.
దీనిపై సునీత స్పందించారు. తనకు చైతన్య అనే మేనల్లుడు లేరని.. అసలు చైతన్య అనే వ్యక్తి తనకు తెలియదన్నారు. తన పేరు చెప్పుకొని ఇలా అందరినీ మోసం చేస్తున్నారని తెలియడంతో బాధేసిందన్నారు. ఈ వ్యక్తి ఎదురైతే పళ్లు రాలిపోతాయన్నారు. ఇలా తన పేరు చెప్పుకునే వ్యక్తులెవ్వరినీ నమ్మొద్దన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సునీత చెప్పారు.