జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ ఎత్తులు సాగుతూనే ఉన్నాయి. తాజాగా జగన్ కి మంచి బుద్ధి ఇవ్వాలి అని కోరుతూ గణపతి మొహం చేసారు టీడీపీ నేతలు. ఈ హోమం కృష్ణా జిల్లా చర్లపల్లి లో సాగింది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణాన్ని జగన్ అడుగు అడుగునా అడ్డుకుంటూ సాగుతున్నాడు అనీ జగన్ కుట్రలు భగ్నం కావాలి అంటూ హోమం నిర్వ హించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతా మంచి జరిగేలా ఆశీర్వదించాలని దేవుడిని కోరుకున్నారు.
స్థానిక లయన్స్ కాంప్లెక్స్ వద్ద ఈ హోమం జరిగింది. పురోహితుడు వేమూరి శ్రీనివాస్ శాస్త్రోక్తంగా గణపతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. టీడీపీ నేతలతో పాటు రైతులు కూడా ఈ హోమానికి హాజరు అయ్యారు. ముఖమంత్రి అవ్వడం తప్ప జగన్ కి మరేం ఆశ లేదు అనీ దానికోసమే ఈ దొంగ దీక్షలు చేస్తున్నాడు అని ఆరోపించారు వాళ్ళు.