పాయల్ కల నిజమైంది…

టీవీ ఇండస్ట్రీ ద్వారా కెరీర్ మొదలుపెట్టింది అందాల తార పాయల్ రాజ్ పుత్.. అనంతరం ‘ఆర్ఎక్స్ 100’తో వెండితెర ఎంట్రీ ఇచ్చి… తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో గ్లామర్ తో పాటు, మంచి నటనను ప్రదర్శించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ ఇండో పాక్ బోర్డర్ కథలో ఈమె నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. దీంతో చిత్ర యూనిట్ డబ్బింగ్ పనులు మొదలు పెట్టింది. అయితే పాయల్ రాజ్ పుత్ తొలిసారి తెలుగులో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పాలని ఉందని తన మనసులో మాటను పెట్టింది పాయల్.

తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మిషన్ కంప్లీటెడ్.. మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పానంటూ ఆనందంగా డబ్బింగ్ స్టూడియో ఫొటోలను షేర్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here