ఎంపీతో పాటు ఆరుగురికి క‌రోనా పాజిటివ్‌..

దేశంలో క‌రోనా ఉదృతి కొన‌సాగుతూనే ఉంది. ప‌న్నెండు రోజుల్లోనే ప‌ది ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీన్ని బ‌ట్టి క‌రోనా ఏ విధంగా విజృంభిస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు.  కోవిడ్ ధాటికి సామాన్యుల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు కూడా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ ఎంపీ వంగా గీతకు క‌రోనా సోకింది. ఈమెకు ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో క‌రోనా టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ప‌రీక్ష‌ల్లో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో వైద్యుల సూచ‌న‌ల మేర‌కు ఎంపీ హోంఐసోలేష‌న్‌లోనికి వెళ్లిపోయారు. ఇటీవ‌ల ఎంపీ తన నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఆమెకు క‌రోనా సోకిన‌ట్లు స‌న్నిహితులు చెబుతున్నారు.

కాగా ఎంపీతో పాటు కార్యాల‌యంలో మొత్తం ఆరుగురికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. వీరు కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఇక తాజాగా కేంద్రం కూడా క‌రోనాపై ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. క‌రోనా సోకిన అనంత‌రం కూడా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేంద్రం సూచించింది. కొద్ది రోజుల వ‌ర‌కు ల‌క్ష‌ణాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here