కేంద్ర మంత్రిని కలిసిన పాయల్..అనురాగ్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. !

తనపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆరోపణలు చేయడమే కాకుండా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనురాగ్ ను విచారించారు కూడా. పాయల్ తనపై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని అనురాగ్ ఖండించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా పాయల్ తన పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళింది. బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన పాయల్ ఘోష్… తనకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ… కిషన్ రెడ్డికి లేఖను అందజేసింది పాయల్. కిషన్ రెడ్డిని కలిసినప్పుడు దిగిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ..  ‘ఇది చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య, ఇపుడు చ‌ర్య‌లు తీసుకునే స‌మ‌యం వ‌చ్చింద‌ని’ పేర్కొంది. మరి ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here