అజ్ఞాతవాసి తర్వాత రాజకీయాల కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఏకంగా మూడు సినిమాలతో బాక్సాఫీస్ పైకి దండెత్తడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో పవర్ స్టార్ నటిస్తోన్న విషయం తెలిసిందే. మొగల్ సామ్రాజ్యానికి చెందిన కోహినూర్ వజ్రం దొంగతనం నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక గజదొంగగా నటించనున్నాడని సమాచారం.
తెలంగాణకు చెందిన ఓ గజదొంగగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్ర టైటిల్ కు సంబంధించి ప్రస్తుతం ఆసక్తికరమైన పేరు వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి `గజదొంగ`.. విరూపాక్ష వంటి పలు పేర్లు వినిపించగా. తాజాగా ఈ చిత్రానికి `ఓం శివమ్` అనే టైటిల్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా టైటిల్ పై స్పష్టత రావాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాలి.