జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపడుతున్నారు.ఈ యాత్ర పవన్ కళ్యాణ్ కొలువుల ఇంట దైవం కొండగట్టు ఆంజనేయస్వామి గుడి నుండి ప్రారంభమవుతుంది.గతంలో అన్నయ్య పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ పర్యాటనల లో విద్యుత్ షాక్ కి గురై ప్రమాదం నుండి తప్పించడం జరిగింది పవన్ కళ్యాణ్, ఇదే కొండగట్టు ప్రాంతంలో.కనుక మొదట కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని అక్కడ నుంచి యాత్రను ప్రారంభిస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్.
ఈ క్రమంలో మూడు, నాలుగు జిల్లాల నేతలతో సమావేశమైన తర్వాత కొండగట్టులో తన యాత్ర పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. వీలైతే పాదయాత్ర లేకపోతే బస్సుయాత్ర.. అవసరమైతే రోడ్ షో.. ఇలా వీలున్న మార్గాల్లో ప్రజల చెంతకు వెళతానని చెప్పారు. ప్రత్యేకించి విరామం అనేది ఉండదని తెలిపారు. ప్రజాసమస్యలను అధ్యయనం చేయడానికే ఈ యాత్రను చేపడుతున్నానని చెప్పారు. పాదయాత్ర చేస్తే ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉండదని తెలిపారు. యాత్రలో భాగంగా ఎక్కడికక్కడ జనసేన కార్యకర్తలతో సమావేశమవుతానని చెప్పారు.