పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అందరూ ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఆయన చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తున్నారు. దీంతో అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇక ఆయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటించేసి అభిమానులకు పండగలాంటి వార్తలే చెబుతున్నారు.
తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్. పవన్కల్యాణ్ ‘వకీల్సాబ్’ అంటూ థియేటర్స్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. పవన్ ఈ సినిమా తర్వాత చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్తో క్రిష్ కూడా ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అన్నింటికంటే ఆలస్యంగా ప్రకటించిన ‘అయ్యపనుమ్ కోషియుమ్’ రీమేక్ కి సంబంధించిన పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయట. దాంతో.. ‘వకీల్ సాబ్’ తర్వాత పవర్ స్టార్ నుంచి రాబోయే సినిమా ‘అయ్యపనుమ్ కోషియుమ్’ రీమేకే నంటూ ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు తెలుగులో పలువురు అగ్ర కథానాయకులతో పనిచేసిన తమన్.. ఇప్పుడు పవన్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.
వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ ‘అయ్యపనుమ్ కోషియుమ్’ రీమేక్ కి కూడా తమనే సంగీతాన్నందిస్తున్నారు. ఈ సినిమా ఒరిజినల్లో హీరోలుగా నటించిన బిజూ మీనన్, పృథ్వీరాజ్ సినిమాకోసం ఓ ప్రోమో సాంగ్ ఆలపించారు. అలాగే.. తెలుగులోనూ పవన్, రానా చేత ప్రోమో సాంగ్ పాడించడానికి ఓ పవర్ ఫుల్ ట్యూన్ రెడీ చేయబోతున్నారట తమన్. ఇది వరకు దేవి సంగీత సారథ్యంలో గొంతు సవరించిన పవన్.. తమన్ కోరికను మన్నించి పాట పాడుతారా అన్నది వేచి చూడాలి.