చంద్రబాబు అవినీతిని కడిగేసిన పవన్

గుంటూరు వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజా రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి చేసిన అవినీతిని కడిగిపారేశారు. గత ఎన్నికలలో అనుభవం ఉందని మద్దతిస్తే రాష్ట్రాన్ని దోచేశారు రాబోయే ఎన్నికలలో మద్దతివ్వనని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
రాష్ట్ర సమస్యలకోసం 29సార్లు ఢిల్లీకి వెళ్లానని పదే పదే చెబుతున్నారని, ప్రధాని మోడీ ఏం చేస్తారని, మన బంగారం మంచిదైతే కదా? శేఖర్ రెడ్డి కేసులో లోకేష్ ఉన్నాడని, అందుకే ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తనకు సమాచారం ఉందని పవన్ చెప్పారు . చంద్రబాబు ఒత్తిడి వల్లనే అవినీతి చేయాల్సివస్తోందని, అధికార పార్టీ నేతలు తన దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారని పవన్ తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఇసుకను, భూములను అడ్డంగా దోచేస్తున్నారని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. ఇలా ప్రతి రంగంలో తెలుగుదేశం పార్టీ అవినీతి చేసేస్తుందని ఆరోపించారు పవన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here