చంద్రబాబు కుట్రలు ముందే పసిగట్టిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు తనపై చేస్తున్న కుట్రను ముందే పసిగట్టారు. చంద్రబాబు గతంలో పవన్ కళ్యాణ్ కి 2+2 గన్ మెన్ల సెక్యూరిటీ నియమించింది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల  జనసేన పార్టీ చేపడుతున్న ప్రతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి తెలిసిపోవడంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సెక్యూరిటీని త‌న‌పై నిఘా కోసం వాడుకుంటోందనే అనుమానం పవన్ వ్యక్తం చేస్తున్నారు.
జనసేన పార్టీ అంతర్గత విషయాలు, సమావేశాల వివరాలు లీక్ అవుతున్నాయని భావిస్తున్న క్రమంలోనే గన్ మెన్లను వెనక్కి పంపే నిర్ణయం పవన్ తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని నలుగురు గన్ మెన్లకు పవన్ సిబ్బంది తెలియ‌జెప్పి ప్రభుత్వానికి సరెండర్ కావాలని వారికి సూచించింది. ఇటీవల గుంటూరు నగరంలో పార్టీ ఆవిర్భావ మహాసభలో చంద్రబాబుపై ఆయన కుమారుడు లోకేష్ పై  పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి గన్ మాన్ సెక్యూరిటీ అంటూ దివాలాకోరు రాజకీయాలు చేశారు. దీన్ని పసిగట్టిన పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here