జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు ఉంటుందని పార్టీ ఆవిర్భవించిన రోజులలో స్పష్టం చేశాడు.అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోచురుకుగా ఉంటున్న తన పార్టీ కార్యకలాపాలను…ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ అడుగుపెట్టాలని భావించింది ఈ క్రమంలోఇటీవల ఆత్మహత్య చేసుకున్ననిరుద్యోగ యువకుడు మురళి కుటుంబాన్ని పరామర్శించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు….ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ తను తాజాగా పర్యటించిన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తావించాడు.
ఈ క్రమంలో పవన్ తన తెలంగాణ పర్యటన గురించి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం తెలియజేశాడు.. అయితే దీనికి ప్రతిస్పందనగా తెలంగాణ పోలీసులు తాజాగా స్పందించారు . పవన్ పర్యటనకు అవసరమైన బందోబస్తు తాము చేయలేమని, ప్రస్తుతం అయిదారుగురు మించి పోలీసులను కూడా పవన్ సెక్యూరిటీకి కేటాయించలేమని చెప్పేశారు.దీంతో పవన్ కళ్యాణ్ తన గజ్వల్ పర్యటన తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసుకున్నారు.
ఈ విషయంలో జనసేన ఒకటి తలిస్తే కెసిఆర్ మరొకటి తలిచారు ఈ చర్యలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ హడావిడి తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదనే భావన కెసిఆర్ కి మనసులో .. ఉన్నట్టు అర్థమౌతుంది.ప్రస్తుత కేసీఆర్ చర్యలను బట్టి రాజకీయ విశ్లేషకులుతెలంగాణ లో పవన్ పార్టీ వేళ్లూనుకోవడం అంత ఈజీ కాదని తేల్చేస్తున్నారు.