జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు విషయమై లెక్క తేల్చడానికి ఏర్పాటుచేసిన జేఎఫ్ సీ కమిటీ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలామంది రాజకీయ నాయకులు పాల్గొనడం జరిగింది. అయితే ఈ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది.
తాజాగా ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నాయకుల మీద పవన్ కళ్యాణ్ సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జేఎఫ్ సీ సమావేశానికి అన్ని పార్టీల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలను కూడా ఆహ్వానించాను. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన నేతల అభిప్రాయాలను తెలుసుకోవడానికి పిలిచాను తప్ప కౌగిలించుకోవడానికి కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ వైఖరిపై మండిపడ్డారు. సమావేశాలకు ఇలా పిలిచి అవమానించడం మర్యాద కాదని తెలిపారు కాంగ్రెస్ నాయకులు. రాజకీయాలలో శత్రువుని కూడా గౌరవించటం నేర్చుకోవడం తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ కి సూచించారు కాంగ్రెస్ నాయకులు.