ఇటీవల ప్రజా సంకల్ప యాత్ర లో బాగంగా జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సవాల్ చేయడం జరిగింది ఎంపీల రాజీనామా విషయంలో. ఈ సందర్భంగా జనసేన అధినేత జగన్ చేసిన సవాల్ స్వీకరిస్తూ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ..అవిశ్వాస తీర్మానాన్ని జగన్ పెట్టాలని అయన కోరారు.అవిశ్వాస తీర్మానానికి మద్దతు కావాలన్నారు.. మీకు కావాల్సిన మద్దతు నేనిస్తానని … ఒక్క ఎంపీతో నైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అని అన్నారు.
వచ్చే నెల ( మార్చి ) 4న నేను ఢిల్లీకి వస్తాను. అందరు ఎంపీల మద్దతు కూడగడతాను. ముందు జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టాలి” అని అన్నారు .వైసీపీ అవిశ్వాస౦ పెడితే టీడీపీ పార్టీ వైఖరే౦టో తెలుస్తుందన్నారు. అంతేకాకుండా జగన్ దమ్ము దైర్యం ఉన్న నాయకుడు అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం గురించి ఎటువంటి అభివృద్ధి నిర్ణయం తీసుకున్నా జగన్ వెంట నేను నడుస్తానని అన్నారు పవన్ కళ్యాణ్.