‘ఓ..  వుమానియా’లో తొలి గెస్ట్ ఎవరో తెలుసా..? 

తనదైన చలాకి మాటలతో, పంచ్ డైలాగులతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్ శ్రీముఖి ఇటీవల ‘ఓ..  వుమానియా’ అనే టాక్ షోతో రానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా విడుదల చేసిన ‘ఓ.. వుమానియా’ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ షోలో పాల్గొనే తొలి మహిళా సెలబ్రిటీ ఎవరనే విషయం తెలిసిపోయింది. తాజాగా మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన వివరాలను శ్రీముఖి తెలిపింది. తన మొదటి ఎపిసోడ్ లో యాంకర్‌ సుమని ఇంటర్వ్యూ చేయబోతున్నట్లుగా శ్రీముఖి తెలిపింది. ఈ షోకి సంబంధించిన ప్రోమోని కూడా శ్రీముఖి పోస్ట్ చేసింది. ఈ ప్రోమోలో శ్రీముఖితో కలిసి, సుమ డ్యాన్స్ చేస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే లాక్ డౌన్ సమయంలోనూ శ్రీముఖి.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here