ఇటీవల సైబర్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ పరిచయలు మోసాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసులు పలు రకాల ప్రచారాలు చేస్తున్న విషయం తెలిసిందే. సైబరాబాద్ పోలీసులు తాజాగా రూపొందించిన ఓ వీడియోలో హీరో ఎన్టీఆర్ ప్రజలకు మంచి సందేశాన్నిచ్చాడు.
ఓ యువతికి ఫేస్బుక్లో పరిచయమై వ్యక్తి వల్ల ఎదురైన చేదు అనుభవాన్ని ఇతివృత్తంగా తీసుకొని సైబరాబాద్ పోలీసులు ఓ షార్ట్ ఫిలిమ్ను రూపొందించారు. ఈ వీడియో చివరిలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు. అలాంటి ప్రమాద పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి’ అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. అయితే గతంలో తీసిన వీడియోనే ఇప్పుడు సైబర్ క్రైం వారు మళ్లీ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
https://twitter.com/hydcitypolice/status/1314161843292696580