యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేజీఎఫ్ ఫేమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్‘ చిత్రంలో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలు పూర్తైన వెంటనే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పవర్ఫుల్ మాఫియా డాన్లా కనిపించబోతున్నారని టాక్. అంతేకాదు ఈ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ సరికొత్తగా మేకోవర్ కాబోతున్నారని తెలుస్తుంది.
దాదాపు రూ. 300 కోట్లతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారని, బయోవార్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, ‘మిస్సైల్‘ అనే టైటిల్ ఈ సినిమాకు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.