ఇండస్ట్రీలో కొత్త కొత్త టార్గెట్లు మొదలవుతున్నాయి. కరోనా వచ్చిన తర్వాత హీరోలు, హీరోయిన్లు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఈ దారిలోకి వస్తున్నారు. ఇప్పటికే సమంత ఓటీటీ వేదికగా దుమ్మురేపుతోంది. ఈ జాబితాలోకి ఇంకా హీరోయిన్లు చేరిపోయారు.
దక్షిణాదికి చెందిన పలువురు హీరోయిన్లు వెబ్ సిరీస్ల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సమంత, తమన్నా, సాయిపల్లవి, అంజలి తదితర హీరోయిన్లు వెబ్ సిరీస్ల్లో నటించారు. తాజాగా ఆ జాబితాలోకి రాశీ ఖన్నా కూడా చేరింది. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షాహిద్ కపూర్తో కలిసి రాశి ఓ వెబ్ సిరీస్లో సందడి చేయబోతోంది. తమిళ ప్రముఖ కథానాయకుడు విజయ్ సేతుపతి కూడా ఈ వెబ్ సిరీస్లో కీలక పాత్ర చేస్తున్నాడు. `ఫ్యామిలీ మేన్` సిరీస్ను రూపొందించిన రాజ్-డి.కె. ఈ వెబ్ సిరీస్ను కూడా తెరకెక్కించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కాబోతోందట. ఓటీటీ ప్రపంచంలోకి ఇంకెత మంది హీరోయిన్లు వచ్చేస్తారో వేచి చూడాలి.