కరోనాపై ‘సంపు’ కొత్త చిత్రం..!

‘ హృదయ కాలేయం’ సినిమాతో ఇండస్ట్రీలో ఒక అలజడి సృష్టించాడు హీరో సంపూర్ణేష్ బాబు. మొదట్లో ఈ సినిమా పట్ల, సంపూర్ణేష్ బాబు పట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. తర్వాత సంపూర్ణేష్ బాబు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక కొబ్బరి మట్ట చిత్రం తర్వాత సంపూర్ణేష్ బాబు మరే చిత్రంలో నటించలేదు… అయితే తాజా సమాచారం ప్రకారం సంపూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. గతంలో సంపూతో సినిమాలు తీసిన సాయి రాజేష్ మరోసారి సంపూను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు స్పూఫ్ కామెడీ తో ఆకట్టుకున్న సంపూర్ణేష్ బాబు ఇప్పుడు కరోనా పై ఓ సినిమా చేయనున్నాడట. కరోనా సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు, వైరస్ కు సంబంధించిన కొన్ని విషయాలకు హాస్యాన్ని జోడించి ఈ సినిమా తీయనున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెkt కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here