టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న లోకేష్ ఇటీవల మళ్లీ ప్రభుత్వంపై దాడి ప్రారంభించారు. ఇక త్వరలోనే ఆయన ప్రజల్లోకెళ్లి ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడనున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా ఆదోనిలో సచివాలయం డిజిటల్ అసిస్టెంట్పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ విషయంపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీలో వై.ఎస్ జగన్ గారి ధౌర్జన్యకాండ కొనసాగుతోందని ఆయన అన్నారు. ఆ పార్టీ గూండాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడానికి ఎంత ధైర్యమని లోకేష్ ప్రశ్నించారు.
ఇక ఈ దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదోనిలో జరిగిన సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ దాడిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగులపై దాడులకు దిగడం మంచి పద్దతి కాదని పబ్లిక్ మండిపడుతున్నారు.