NEET, JEE పరీక్షలను వాయిదా వేయమని కోరిన సోనూసూద్

రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న క్లిష్ట పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం NEET,JEE పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళిక ఇచ్చింది. ఈ పరీక్షలను వాయిదా వేయాలని, పరీక్షలు పేరుతో విద్యార్థుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టవద్దని దేశ వ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు.

బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా విద్యార్థుల వైపు నిలబడ్డాడు. దీనిపై స్పందించిన ఆయన ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని NEET,JEE పరీక్షలను భారత ప్రభుత్వం వాయిదా వేయాలని, విద్యార్థుల జీవితాలను రిస్క్‌లో పెట్టొద్దని అన్నారు. అయితే పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలని కోరట్లేదని, రెండు మూడు నెలలు వాయిదా వేయాలని మాత్రమే విజ్ణప్తి చేస్తున్నామని తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here