మన దేశంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రికవరీ రేటు తో కాస్త ఊరట లభిస్తున్న కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. గడిచిన 24 గంటల్లో 67,151 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 32,34,474 కి చేరింది.
ప్రస్తుతం అందులో 7,07,267 యాక్టివ్ కేసులు ఉండగా, 24,67,758 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 1059 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 59,449 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 8,23,992 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 76.03 శాతం ఉండగా, మరణాల రేటు 1.8 శాతంగా ఉంది